హీరో ధనుష్ మరియు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ‘కుబేర’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్ ప్రత్యేకంగా పాట పాడినట్టు సమాచారం.
భాస్కరభట్ల రచించిన హీరో ఇంట్రడక్షన్ గీతానికి, దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో ధనుష్ స్వయంగా గాత్రాన్ని అందించారు. చెన్నైలో ఈ పాట రికార్డింగ్ పూర్తి కాగా, ఇది కొత్త శైలిలో ఉండబోతోందని చిత్ర బృందం వెల్లడించింది.
ఈ పాట సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ధనుష్ గాత్రం సినిమాలో ప్రత్యేక ముద్ర వేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘కుబేర’ సినిమా టైటిల్కి తగ్గట్లు మ్యూజిక్లో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నారని సమాచారం.