నిజ జీవిత కథ ఆధారంగా ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇడ్లీ కొట్టు’. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇటీవల జరిగిన ఆడియో లాంచ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ…
“చిన్నప్పుడు ఇడ్లీ తినాలని రోజూ అనిపించేది. కానీ అప్పట్లో డబ్బులుండేవి కావు. ఇప్పుడు డబ్బులున్నా, చిన్నతనంలో తిన్న ఇడ్లీ ఆనందం, రుచి ఇప్పుడు లభించడం లేదు.” ఈ సినిమా తన జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందిందని, ఇది చాలా మందికి స్ఫూర్తిని ఇస్తుందని ఆయన తెలిపారు.
ట్రోల్స్పై ధనుష్ స్పందన
“హేటర్స్ అనే వాళ్లు నిజంగా ఉండరు. అందరూ హీరోల సినిమాలు చూస్తారు. కానీ కొందరు 30 మంది టీమ్లా కలిసి 300 ఫేక్ ఐడీలతో ద్వేషం చూపిస్తారు. నిజానికి వాళ్ళు సినిమా చూస్తారు. బయట కనిపించే దానికి, రియాలిటీకి చాలా తేడా ఉంటుంది” అని ధనుష్ అన్నారు.
వడ చెన్నై సీక్వెల్
ఈ ఈవెంట్లో ధనుష్ మరో సినిమా కూడా ప్రకటించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వడ చెన్నై’ సీక్వెల్లో త్వరలో నటించనున్నట్లు తెలిపారు.
‘ఇడ్లీ కొట్టు’లో తారాగణం
ఈ సినిమాలో ధనుష్ సరసన నిత్యామీనన్ నటిస్తున్నారు. ‘తిరు’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రకాశ్ రాజ్, షాలినీ పాండే లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో రూపొందింది.