టీటీడీ గోశాల‌లో ఘోరం.. ప‌వ‌న్‌ ఎక్క‌డ‌?

టీటీడీ గోశాల‌లో ఘోరం.. ప‌వ‌న్‌ ఎక్క‌డ‌?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న గోశాల‌ (Goshala) ల్లో అత్యంత దారుణ‌మైన ప‌రిస్థితులపై టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) సంచ‌ల‌న ఫొటోలు (Photos) విడుద‌ల చేశారు. గోశాల‌లో మృతిచెందిన గోవుల (Dead Cows) ఫొటోలు హృద‌య‌విదార‌కంగా ఉన్నాయి. హిందూధ‌ర్మ ప‌రిర‌క్ష‌కులు, స‌నాత‌న వాదులు సైతం దిగ్భ్రాంతికి గుర‌య్యేలా ఫొటోలు ఉన్నాయి. మూడు నెల‌ల్లో గోశాల‌ల్లోని 100కు పైగా గోవులు మృతిచెందాయని, ఈ విష‌యాన్ని కూట‌మి ప్ర‌భుత్వం బ‌య‌ట‌కు తెలియ‌నీయ‌కుండా ర‌హ‌స్యంగా దాచిపెట్టిందని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇంత జ‌రుగుతుంటే ప‌వ‌నానంద స్వామి ఏం చేస్తున్నారని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్‌ (Pawan Kalyan) ను భూమ‌న ప్ర‌శ్నించారు.

హైంద‌వ ధ‌ర్మాన్ని కాపాడుతాం.. హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉంటాం.. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడ‌ట‌మే ధ్యేయం అని చెప్పిన సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu Naidu) ఏం స‌మాధానం చెబుతార‌ని భూమ‌న ప్ర‌శ్నించారు. వైసీపీ పాల‌న‌లో 500 ఆవుల‌ను దాత‌ల ద్వారా సేక‌రించి సంర‌క్షిస్తే.. ఆ ఆవుల దుస్థితి కూట‌మి పాల‌నలో అత్యంత ద‌య‌నీయంగా ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. లేగ‌దూడ‌ల‌ను ప‌ట్టించుకునేవాడు లేడని, చెత్త‌కు వేసిన‌ట్లుగా ఆవుల‌కు గ్రాసం వేస్తున్నారని, గోవులు మృతి (Cow Deaths)పై విచార‌ణ (Investigation) చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

వంద‌ల సంఖ్య‌లో గోవుల మృతిచెంద‌డంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన పాల‌క‌మండ‌లిపై భ‌క్తులు విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంపై స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించాల‌ని (Should Respond) భ‌క్తులు కోరుతున్నారు. తిరుమ‌ల ల‌డ్డూ ఆరోప‌ణ‌ల‌పై పాయ‌శ్చిత దీక్ష చేసిన ప‌వ‌న్‌.. ప్ర‌త్య‌క్షంగా క‌నుల‌కు క‌నిపిస్తున్న గోవుల మ‌ర‌ణంపై స్పందించాల‌ని డిమాండ్లు పెరుగుతున్నాయి. గోవును స‌క‌ల దేవ‌త‌ల స్వ‌రూపిణిగా భావిస్తూ, గోమూత్రాన్ని తీర్థంగా స్వీక‌రించే భార‌తీయ జ‌న‌తా పార్టీ (Bharatiya Janata Party – BJP) నేత‌లు ఈ విష‌యంపై వెంట‌నే స్పందించాల‌ని భ‌క్తులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. వంద‌ల సంఖ్య‌లో గోవుల మ‌ర‌ణంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీ నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment