‘కంగువ’ విమర్శలపై స్పందించిన దేవీశ్రీ ప్రసాద్

'కంగువ' విమర్శలపై స్పందించిన దేవీశ్రీ ప్రసాద్

త‌మిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న “కంగువ” సినిమా పాటలపై వచ్చిన విమర్శల గురించి ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ స్పందించారు. “మనం ఏది చేసినా విమర్శించేవారుంటారు. ఇది సహజమే. కానీ నాకు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పటికీ, పాటలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి” అని ఆయన అన్నారు.

అంతేకాక, “సూర్య స్వయంగా 30 నిమిషాల పాటు నాతో మాట్లాడి పాటల గురించి ప్రశంసించారు. అది నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది” అని దేవీశ్రీ ప్రసాద్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

విమర్శలు తమ పని పట్ల మెరుగుదలకు ఉపయోగపడతాయని దేవీశ్రీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. “విమర్శల ద్వారా మన పనిలో లోపాలను అర్థం చేసుకుని, మరింత బాగా చేయగలమనే భావన కలుగుతుంది” అని ఆయన అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment