ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ-జనసేన నాయకుల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. నారా లోకేశ్ (Nara Lokesh)ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్తో ఈ విభేదాలు మొదలయ్యాయి. టీడీపీ నేతల మాటలకు ప్రతిగా జనసైనికులు (Janasena) కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ను డిప్యూటీ సీఎంగా చూడాలని వారికి కోరిక ఉంటే మాకు మా పవన్ (Pawan Kalyan)ను సీఎంగా చూడాలని ఆశగా ఉంది
ని బహిరంగంగానే మాట్లాడారు.
టీడీపీ-జనసేన మాటల యుద్ధంతో ఆ పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు తలెత్తాయి. అయితే, ఈ విషయం మీద సమయానికి స్పందించిన రెండు పార్టీల నేతలు కూటమి కార్యకర్తలకు శాంతి, సహనంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చాయి. అయినా వాదనలు ఆగలేదు, వివాదాలు సమసిపోలేదు. డిప్యూటీ ఏంటీ.. లోకేశ్ను ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రకటించాలన్న డిమాండ్లు సైతం తలెత్తాయి. దీంతో బీజేపీ నిర్ణయంతో పవన్ కీలక బాధ్యతలు చేపడుతున్నాడని మరో ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఇలా వివాదం ఏదో మూల నుంచి రచ్చకెక్కుతూనే ఉంది.
ఈ వివాదంపై గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలకమైన సందేశం ఇచ్చారు. ఎన్డీయే శ్రేణులు (NDAlliance) బాధ్యతాయుతంగా ఉండాలి, కూటమి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనవసరంగా వివాదాలు సృష్టించకూడదని, భవిష్యత్తులో కూడా అలాంటివి మానుకోవాలని సున్నితమైన వార్నింగ్ ఇచ్చారు. అనవసరమైన ప్రచారాలకు, కూటమి విషయంలో ఎవరూ స్పందించకుండా, ఒకరినొకరు గౌరవించాలి అని ఆయన పేర్కొన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ జనసైనికుల నోళ్లను కట్టేసేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని టీడీపీ.. కాదు టీడీపీ ఓవరాక్షన్ను అడ్డుకునేందుకు అలా మాట్లాడారంటూ జనసేన వాదించుకుంటున్నాయి.