282 మంది ప్ర‌యాణికులు.. విమానంలో ఒక్క‌సారిగా మంటలు

282 మంది ప్ర‌యాణికులు.. విమానంలో ఒక్క‌సారిగా మంటలు

అమెరికాలోని ఓర్లాండో ఎయిర్‌పోర్ట్(Orlando Airport)లో పెను ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్‌లైన్స్ (Delta Airlines)కు చెందిన విమానంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ప్రయాణికులందరినీ భయభ్రాంతులకు గురిచేశాయి. మంట‌లు చెల‌రేగిన సమయంలో ఆ విమానంలో మొత్తం 282 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే సిబ్బంది చాకచక్యంతో వెంటనే క్యాబిన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వారందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. వారి వేగవంతమైన చర్య వల్లే పెద్ద ప్రమాదం జరగకుండా తప్పించుకోవడం సాధ్యపడింది.

ఇంజన్‌లు ఢీ కొట్టడంతో మంటలు
విమానం టేకాఫ్ అవుతుండగా, రెండు ఇంజిన్లు ఒకదానితో ఒకటి తగలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం ఊరటనిచ్చే విష‌యం. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు పేర్కొన్నారు. విమాన సంస్థ‌కు మాత్రం తీవ్రంగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలో మంటలు చెలరేగుతున్న దృశ్యాలు చూసినవారు షాక్‌కు గురవుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment