అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో 64 మందీ దుర్మరణం చెందారు. పీఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన ఓ ప్రయాణికుల విమానం గాల్లోనే మిలిటరీ హెలికాప్టర్ను ఢీకొంది. అనంతరం ఆ విమానం సమీపంలోని పోటోమాక్ నదిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 64 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు. ఆ విమానంలో ఉన్న 64 మంది మృతిచెందారు.
విమానం 64 మంది ప్రయాణికులతో కాన్సాస్లోని విషిటా నుంచి బయల్దేరింది. బుధవారం సాయంత్రం రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్టు ల్యాండింగ్కు సిద్ధమవుతుండగా మిలిటరీకి చెందిన సికోర్స్కీ హెచ్-60 బ్లాక్హాక్ హెలికాప్టర్ను ఢీకొట్టింది. భారీ శబ్ధంతో రెండూ పోటోమాక్ నదిలో కుప్పకూలాయి. మొత్తం 64 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మానవ తప్పిదం వల్లనే జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.