అంతరిక్షంలోకి తెలుగు తేజం.. చ‌రిత్ర సృష్టించ‌నున్న‌ జాహ్నవి

అంతరిక్షంలోకి తెలుగు తేజం.. చ‌రిత్ర సృష్టించ‌నున్న‌ జాహ్నవి

అంతరిక్షం (Space)లో అడుగుపెట్ట‌నున్న తొలి తెలుగు అమ్మాయి (Telugu Girl)గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh)కు చెందిన యువ‌తి చరిత్ర సృష్టించనున్నారు. పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా పాలకొల్లు (Palakollu)కు చెందిన దంగేటి జాహ్నవి (Dangeti Jahnavi) 2029లో అంత‌రిక్షం (Space)లో అడుగుపెట్ట‌నుంది. నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ (NASA International Air And Space) ప్రోగ్రామ్‌ (Program)లో అత్యుత్తమ ప్రదర్శనతో ఉత్తీర్ణత సాధించిన జాహ్నవి, టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ (Titan Space Industries) నిర్వహించనున్న ఆర్బిటల్ మిషన్‌లో భాగస్వామిగా ఎంపికైన తొలి భారతీయ యువ‌తిగా గుర్తింపు పొందారు. ఈ 23 ఏళ్ల జ‌హ్న‌వి సాధించిన ఘనత తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచింది. జాహ్నివి అంత‌రిక్ష ప్ర‌యాణ సాధ‌న‌కు వైసీపీ(YSRCP) అధికారంలో నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) ప్ర‌భుత్వం త‌ర‌ఫు నుంచి రూ.50 ల‌క్ష‌ల ఆర్థిక సాయం (Financial Assistance) అందించిన ఫొటోలు, పేప‌ర్ క్లిప్స్‌ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జాహ్నవి, చిన్నతనం నుంచే అంతరిక్ష పరిశోధనపై బ‌ల‌మైన ఆసక్తి పెంపొందించుకుంది. పోలాండ్‌లోని అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో 2022లో శిక్షణ పూర్తి చేసిన ఆమె, పానోరమిక్ సర్వే టెలిస్కోప్ (Pan-STARRS) డేటా ఆధారంగా గ్రహశకలం ఆవిష్కరణలో పాల్గొన్నారు. నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్‌లో పీపుల్స్ ఛాయిస్ అవార్డు, ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ యంగ్ అచీవర్ అవార్డు వంటి గౌరవాలు ఆమె సామర్థ్యానికి ప్ర‌తిబింబంగా నిలుస్తున్నాయి. 2026 నుంచి మూడేళ్లపాటు టైటాన్ స్పేస్ ఆస్ట్రోనాట్ కాండిడేట్ ప్రోగ్రామ్‌లో కఠిన శిక్షణ పొందనున్న జాహ్నవి, స్పేస్‌క్రాఫ్ట్ సిస్టమ్స్, సర్వైవల్ ట్రైనింగ్, ఫ్లైట్ సిమ్యులేషన్‌లలో నైపుణ్యం సాధించనున్నారు.

జాహ్నవి సాధించిన ఈ అరుదైన గౌరవం తెలుగు యువతకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. “గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నేను, కలలను సాకారం చేసుకోవడం సాధ్యమని నిరూపించాలనుకుంటున్నాను” అని జాహ్నవి పేర్కొన్నారు. ఆమెకు రూ.50 లక్షల స్కాలర్‌షిప్ మంజూరు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జాహ్న‌వికి శుభాకాంక్షలు తెలిపారు, “జాహ్నవి ప్రయాణం యువతకు ఆదర్శం” అని పోస్ట్ చేశారు. పాలకొల్లు నుంచి అంతరిక్షం వరకు జాహ్నవి సాగిన ఈ ప్రయాణం, భారతీయ మహిళల ఆకాంక్షలకు కొత్త రెక్కలు తొడిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment