Exclusive : సరస శృంగార దావోస్‌.. బయటపడిన చీకటి కోణాలు

Exclusive : సరస శృంగార దావోస్‌.. బయటపడిన చీకటి కోణాలు

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక, స్విట్జర్లాండ్‌లోని ప్రఖ్యాత పట్టణం దావోస్‌ తన ఖ్యాతిని కోల్పోతుందా..? దావోస్‌ బ్రాండ్‌ క్రమేణా క్షీణిస్తోందా..? అవునంటోంది బ్రిటన్‌కు చెందిన ‘డెయిలీ మెయిల్‌’ మేగజీన్‌. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా జనవరిలో దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు 3 వేల మందికి పైగా హాజరయ్యారు. కాకపోతే ఈసారి చీకటి వ్యవహారాలు శృతిమించాయని ‘దావోస్‌’పై పరిశోధన చేసిన డెయిలీ మెయిల్‌ పత్రిక వెల్లడించింది.

అమ్మాయిలను సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఎస్కార్ట్‌ ఏజెన్సీలతో తాము మాట్లాడినట్టుగా, వారు సంచలనాత్మక వివరాలు వెల్లడించారని ‘డెయిలీ మెయిల్‌ పేర్కొంది’

‘Dates you Pay for’ అనే వెబ్‌సైట్‌ నిర్వాహకుడితో మాట్లాడితే దావోస్‌కు వచ్చేవాళ్లతో అధికశాతం మంది సెక్స్‌ పార్టీలకు అమ్మాయిలను బుక్‌ చేసుకుంటున్నారని, ఇద్దరుకు మించి ఎక్కువ మంది అమ్మాయిలను బుక్‌ చేసుకున్నవారు వీరిలో ఎక్కువ మంది ఉన్నట్టుగా ఆ నిర్వాహకుడు పేర్కొన్నట్టుగా డెయిలీ మెయిల్‌ తన కథనంలో రాసింది.

తమ సంస్థ నుంచే దాదాపుగా 300 మంది అమ్మాయిలను, లింగమార్పిడి చేయించుకున్న అమ్మాయిలను సప్లై చేశామని ‘Titt4tat’ అనే వెబ్‌సైట్‌ చెప్పినట్టుగా ‘డెయిలీ మెయిల్‌’ రాసింది.
అయితే ఇలా సప్లై అయిన అమ్మాయిలంతా ‘NDA’ ఒప్పందాలు చేయాల్సి ఉంటుంది. అంటే నాన్‌ డిస్‌క్లోజర్‌ అగ్రిమెంట్స్‌పై సంతకాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.

ప్రతినిధి బృందంలో సభ్యులుగా, లేకపోతే స్నేహితులుగా వారిని పరిచయం చేస్తారని, ఆ తర్వాత పార్టీలు కొనసాగుతామని ఆ కథనంలో రాశారు.

ఇలాంటి అమ్మాయిలకు రేట్లు కూడా అధికంగానే ఉంటాయని పేర్కొన్నారు. చూడగానే ఆకట్టుకునే వారికి అధిక రేట్లు ఉంటాయని, గరిష్టంగా ఒక్కొక్కరు 6,000 పౌండ్లు కూడా వసూలు చేసినవారు ఉన్నారని అందులో పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగిన మొదటి మూడురోజులకూ Titt4tat 2,70,000 పౌండ్లు చొప్పున వసూలు చేసింది.

దావోస్‌ వెళ్లకపోవడమే ఒక తప్పిదంగా టీడీపీ, దాని అనుకూల మీడియా చిత్రీకరిస్తున్న సమయంలో డెయిలీ మెయిల్‌ కథనం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది.

అయితే స్విట్జర్లాండ్‌లాంటి ఆధునిక దేశంలో ఇలాంటి వ్యవహారాలు షరామామూలేనన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

కాకపోతే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈసారి దావోస్‌కు వెళ్లిన చంద్రబాబు, అతని ప్రతినిధి బృందం ఉత్తిచేతులతో తిరిగి రావడం మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది. చంద్రబాబు అసలు రంగు బయటపడింది. ఆయన్ని మోస్తున్న టీడీపీ అనుకూల మీడియా బుడగ బద్ధలైంది.

దావోస్ స‌ద‌స్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ బృందం రూ.1.79 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఎంవోయూలు చేసుకుంది. అదే విధంగా మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ బృందం రూ.15.10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు సాధించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment