భార‌త్‌ మ్యాప్ వివాదం.. కాంగ్రెస్‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

భారత మ్యాప్ వివాదం.. సీడబ్ల్యూసీ మీటింగ్‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల్లో ప్రదర్శించిన బ్యానర్‌లపై భారత మ్యాప్‌ను తప్పుగా చూపించారంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఈ మ్యాప్ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మరియు ఆక్సాయ్ చిన్ ప్రాంతాలు లేకుండా భారత మ్యాప్‌ను ప్రదర్శించడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ దుర్బుద్ధికి నిదర్శనమ‌న్నారు త్రివేది. కాంగ్రెస్ పాక్షిక వైఖరిని, విదేశీ శక్తుల ప్రేరణను ప్రస్తావించారు. ఇది సోరస్ సీక్రెట్ సర్వీసు వంటి విదేశీ సంస్థల వల్ల జరిగి ఉండొచ్చు అని కూడా ఆరోపించారు.

వివాదంపై క్లారిటీ
బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ బ్యానర్లు పార్టీ అధికారికంగా ఏర్పాటు చేసిన‌వి కావ‌ని, ఎవరో కార్యకర్తలు పెట్టినవే అని కాంగ్రెస్ నాయకత్వం వివరణ ఇచ్చింది. ఇదే వివాదం బీజేపీ ప్రచారానికి ఒక అస్త్రంగా మారింది.

గతంలోనూ ఇలాంటి ఆరోపణలు
గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలపై కూడా బీజేపీ ప్ర‌స్తావించింది. 2020లో రాహుల్ గాంధీ, 2022లో శశి థరూర్ ఇలాంటి మ్యాప్‌లు షేర్ చేసినట్లు పేర్కొంది. ఇది యాదృచ్ఛికమా, లేక ముందుగా పన్నిన కుట్రా? అని త్రివేది ప్రశ్నించారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కాంగ్రెస్ మరియు బీజేపీ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment