ధోనీ ఫ్యాన్స్కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం శుభవార్త చెప్పింది. అభిమానులు ముద్దుగా పిలుచుకునే తలా.. ఎంఎస్ ధోని (MS Dhoni) మైదానంలో మరోసారి కెప్టెన్ (Captain) పాత్ర పోషించనున్నాడు. ప్రస్తుతం సీఎస్కేకు నాయకత్వం వహిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం (Injury) తో జట్టుకు దూరమవుతుండటంతో కెప్టెన్సీ బాధ్యతలను ధోనీకి అప్పగించింది యాజమాన్యం.
అంతేకాదు, రుతురాజ్ మోచేతికి తీవ్ర గాయం కావడంతో ఈ ఐపీఎల్ సీజన్ మొత్తాన్ని మిస్ అయ్యే సూచనలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే మేనేజ్మెంట్ మళ్లీ మహేంద్ర సింగ్ ధోనికి కెప్టెన్సీ బాధ్యతలు (Responsibilities) అప్పగించింది.