డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Democratic Republic of Congo) లో తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. కాంగో నది (Congo River) లో ఓ పడవ (Boat) బోల్తా పడటంతో 148 మంది ప్రాణాలు (Lives) కోల్పోయారు . ఈ ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నదిలో పడవ బోల్తా పడినప్పుడు, దాదాపు 500 మంది ప్రయాణికులు, అందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.
మటాంకుము ఓడరేవు (Matankumu Port) నుంచి బోలోంబా ప్రాంతం (Bolomba Region) వైపుగా ప్రయాణిస్తున్న హెచ్బి కొంగోలో (HB Kongolo) అనే పడవ, ఎంబండకా పట్టణం సమీపంలో మంటల్లో చిక్కుకుని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన సుమారు 100 మంది ప్రయాణికులను స్థానిక టౌన్ హాల్లోని తాత్కాలిక ఆశ్రయానికి తరలించినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
కాంగోలో పడవ ప్రమాదాలు
కాంగోలో తరచూ పడవ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడి గ్రామాల మధ్య రవాణాకు పాత చెక్క పడవలు ఉపయోగిస్తుండడంతో ఈ రకమైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 2023 అక్టోబర్ లో, ఈక్వేటర్ ప్రాంతంలో ఉన్న ఒక పడవ మునిగిపోతే, కనీసం 47 మంది ప్రాణాలు కోల్పోయారు.