రాబోయే 3 రోజులు జాగ్రత్తగా ఉండండి!

రాబోయే 3 రోజులు జాగ్రత్తగా ఉండండి!

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరగనుంది. ఈ మేర‌కు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గిపోతున్నట్లు తెలిపింది.

ఎక్కడెక్కడ చలి ఎక్కువగా ఉంటుంది?
చలి తీవ్ర‌త ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు చేర‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల 2-8 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

జాగ్రత్తలు తీసుకోండి
చలి నివారణ కోసం తగిన దుస్తులు ధ‌రించాలి. రాత్రిపూట బయటకి వెళ్లడం తగ్గించండి. వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత వేడి పానీయాలు తీసుకుని శరీరాన్ని వేడిగా ఉంచుకోండి. వృద్ధులు, చిన్నారులు చలికి సులభంగా ఎఫెక్ట్ అవుతారు కాబ‌ట్టి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment