దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ (Hyderabad) కీలక ప్రదేశంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Center)లో అత్యవసర సమీక్ష సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఆర్మీ (Army), పోలీస్ (Police), డిజాస్టర్ మేనేజ్మెంట్ (Disaster Management) వంటి కీలక విభాగాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తాజా పరిస్థితులను అంచనా వేసి, ప్రతి శాఖకు అప్రమత్తత అవసరాన్ని సీఎం స్పష్టం చేయనున్నారు. ఈ సమావేశానికి అఖిలపక్ష నేతలు కూడా హాజరుకానున్నట్లుగా సమాచారం.
ఢిల్లీలో ఉన్న భట్టి విక్రమార్కకు ఫోన్
ఈ సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)ను ఫోన్ ద్వారా సంప్రదించిన సీఎం, ఆయనను వెంటనే హైదరాబాద్ చేరుకోవాలని సూచించినట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా ఉండే జాతీయ రక్షణ పద్ధతుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
సాయంత్రం మాక్ డ్రిల్
ఇవాళ సాయంత్రం నిర్వహించనున్న మాక్ డ్రిల్ (Mock Drill)ను సీఎం రేవంత్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఏ రకమైన అనూహ్య పరిణామాలకైనా రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉండేలా సమగ్ర చర్యలు చేపడుతున్నారు.