సీఎం రేవంత్ రెడ్డి పోస్టు.. కేసు న‌మోదు

cm-revanth-reddy-morphed-image-cyber-crime-case

తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ఉద్దేశిస్తూ మార్ఫ్ (Morphed) చేసిన కంటెంట్‌ (Content)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ (Hyderabad Cyber Crime) పోలీసులు క్రిమినల్ కేసు (Criminal Case) నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి టీపీసీసీ (TPCC) సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి కైలాష్ సజ్జన్ (Kailash Sajjan) అధికారికంగా ఫిర్యాదు చేశారు. సజ్జన్ ఫిర్యాదు మేరకు ట్విట్టర్‌లో DigtvTelugu అనే ఖాతా నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను ఎడిట్ చేసి, ఆయనను అసభ్యంగా చూపించేలా పోస్టు చేశారని, ఈ పోస్ట్ మార్ఫింగ్ చేసినదిగా, ముఖ్యమంత్రికి పాటు కాంగ్రెస్ పార్టీని కించపరిచాల‌ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసిన‌ట్లుగా ఆయ‌న తెలిపారు.

అలాగే, ఆ ఖాతా ద్వారా ప్రభుత్వం పై ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా షేర్ చేస్తున్నాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీపీసీసీ ప్ర‌తినిధి ఫిర్యాదు మేర‌కు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలను తెలుసుకునేందుకు X ప్లాట్‌ఫామ్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. అలాగే, సోషల్ మీడియాలో ఈ తరహా తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ కంటెంట్‌పై చర్యలు తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చ‌రించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment