భారత టెస్ట్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా మరోసారి టీమిండియాలోకి రావాలని పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటివరకు 103 టెస్టులు ఆడిన పుజారా, చివరి టెస్టును 2023లో ఆడాడు. అయితే, తన కెరీర్ ఇంకా ముగియలేదని, మరో అవకాశం వస్తే దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటానని ప్రకటించాడు.
జూన్ 20 నుండి ఆగస్ట్ 4 మధ్య భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని పుజారా తెలిపాడు. ఇప్పుడీ అనుభవజ్ఞుడైన బ్యాటర్కు సెలక్టర్లు అవకాశం ఇస్తారా? లేదా? అనేదే ప్రశ్నగా మారింది.