జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనపై (Chenab Rail Bridge) వందే భారత్ రైలు తొలిసారి ప్రయాణం చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. భారత రైల్వే ఈ ట్రయల్ రన్ను శనివారం నిర్వహించింది. కాత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణించే ఈ సెమీ హైస్పీడ్ రైలు, చీనాబ్ నదిపై నిర్మితమైన ఈ అద్భుత వంతెనపై దూసుకుపోతున్న దృశ్యాలు ప్రజలను మంత్రముగ్దులను చేస్తున్నాయి.
చీనాబ్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు
ఈ వంతెనను 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు, ఇది చైనా యొక్క బెయిపాన్ నది రైల్వే వంతెన (275 మీటర్లు) రికార్డును అధిగమించి ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనగా నిలిచింది. 1,315 మీటర్ల పొడవున్న ఈ వంతెన, ఐఫిల్ టవర్తో పోలిస్తే 30 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది.
కశ్మీర్లోని తీవ్రంగా చలికాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వందే భారత్ రైలును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో నీరు గడ్డ కట్టకుండా ఉంచే హీటింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కశ్మీర్ను భారతదేశం మిగతా ప్రాంతాలతో అనుసంధానించడమే లక్ష్యంగా ప్రారంభించబడింది.