చంద్రబాబు పాలన (Chandrababu Administration) లో ఆలయాల శుభ్రత పేరుతో జరిగిన దేవాదాయ నిధుల దోపిడీ మరోసారి వెలుగులోకి వచ్చింది. 2014-19 మధ్య టీడీపీ (TDP) అధికారంలో ఉండగా ఎలాంటి టెండర్లు లేకుండా దుర్గగుడి (Durga Temple) తో పాటు మరో ఆరు దేవాలయాల్లో పారిశుధ్య పనుల కాంట్రాక్ట్ పద్మావతి హాస్పిటాలిటీస్ అండ్ ఫెసిలిటీస్ సర్వీసెస్ (Padmavati Hospitalities and Facilities Services) దక్కించుకుంది. ఆలయాల పరిశుభ్రత పేరుతో నాలుగేళ్ల పాటు చీపురు కట్టలు (Broom Handles), పినాయిల్ బాటిళ్ల (Pinayil Bottles) డబ్బులు మింగేసినట్లుగా సదరు సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తాయి. మళ్లీ అధికారంలోకి రావడంతో లోకేశ్ బంధువు సంస్థ ఆ బాధ్యతలు మళ్లీ దక్కించుకునేందుకు పోటీపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
టీటీడీ పక్కనబెట్టిన సంస్థకు బాధ్యతలు
- 2014-19లో చంద్రబాబు హయాంలో విజయవాడలోని కనకదుర్గ గుడితోపాటు మరో ఆరు దేవాలయాల్లో పారిశుధ్య పనుల కాంట్రాక్టును ప్రస్తుత మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు బంధువైన భాస్కరనాయుడు (Bhaskaranayudu) నేతృత్వంలోని సంస్థకు ఎలాంటి టెండర్లు లేకుండా అప్పగించారు.
- టీటీడీలో స్వీపింగ్, క్లీనింగ్ కాంట్రాక్టు పనులను దక్కించుకున్న ఈ సంస్థ తీరు వివాదాస్పదం కావడంతో పక్కనపెట్టారు.
- అయినప్పటికీ 2015లో టీడీపీ పెద్దల ఒత్తిడితో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన ద్వారకా తిరుమల (Dwarka Tirumala), అన్నవరం (Annavaram), సింహాచలం (Simhachalam), శ్రీశైలం (Srisailam), శ్రీకాళహస్తి (Srikalahasti), పెనుగంచిప్రోలు (Penuganchiprolu) తిరుపతమ్మ దేవాలయం (Tirupatamma Temple) తదితర చోట్ల స్వీపింగ్, క్లీనింగ్ పనులను ఇదే సంస్థకు ఎలాంటి టెండర్లు లేకుండానే మూడేళ్ల పాటు కట్టబెట్టారు. 2018లో మరో ఏడాది పాటు దీన్ని పొడిగించారు.
లోకేశ్ సిఫారసుతో కాంట్రాక్ట్..
- అంతకు ముందు వరకు దుర్గగుడిలో పారిశుద్ధ్య పనులకు స్థానికంగా దేవస్థానం అధికారులే టెండర్ పిలుచుకొని, సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించి స్వీపింగ్, క్లీనింగ్ మెటీరియల్ (Sweeping, Cleaning Materials) ను దేవస్థానమే కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించేవారు. ఇందుకోసం నెలకు రూ.25 లక్షల వరకు దేవస్థానానికి ఖర్చు అయ్యేది.
- 2015లో లోకేష్ సిఫారసుతో పద్మావతి సంస్థ (Padmavati Company) కు నెలకు రూ. 33 లక్షల చొప్పున కాంట్రాక్టుపై ఇచ్చారు. దీంతో దుర్గగుడి దేవస్థానంపై ఏడాదికి అదనంగా రూ.96 లక్షల వరకు భారం పడింది.
- పారిశుధ్య పనుల్లో నిర్ణిత ప్రమాణాలు పాటించడంలోనూ కాంట్రాక్టు సంస్థ విఫలమైందనే అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. పద్మావతి సంస్థలో పనిచేసే సిబ్బందికి సకాలంలో జీతాలు కూడా చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి.
మళ్లీ పైరవీలు
- చంద్రబాబు అధికారంలో ఉండగా చీపురు కట్టలు, పినాయిలు డబ్బాల కొనుగోలులో అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్న పద్మావతి సంస్థ మళ్లీ పైరవీలు స్టార్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. బంధువు సంస్థ కావడంతో నామినేటెడ్ పద్ధతి (Nominated Process) లో బాధ్యతలు ఇచ్చేస్తారని టీడీపీలోని ఓ వర్గం గుసగుసలాడుకుంటోంది.