దుబాయ్ చేరుకున్న సీఎం చంద్ర‌బాబు

దుబాయ్ చేరుకున్న సీఎం చంద్ర‌బాబు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) (UAE) పర్యటనలో భాగంగా దుబాయ్‌ (Dubai)కి చేరుకున్నారు. ప్ర‌త్యేక విమానంలో దుబాయ్ చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అబుదాబి ఇండియన్ ఎంబసీ డెప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్ నాధ్, దుబాయ్ ఇండియన్ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్‌లతో భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, విదేశీ పెట్టుబడిదారులకు ఇవ్వబోయే ప్రోత్సాహకాలు, మరియు ప్రవాసాంధ్రుల అభివృద్ధి ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి బృందం మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటించనుంది. ఈ సందర్భంగా దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాల్లోని వ్యాపార ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment