భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరియు ఆయన భార్య ధనశ్రీ వర్మ విడాకుల కేసుపై ముంబై ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో ధనశ్రీకు రూ.4.75 కోట్లు భరణం రూపంలో చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని చాహల్ ఇప్పటికే అంగీకరించగా, ఈ మొత్తంలో ఇందులో రూ. 2.37 కోట్లు చెల్లించినట్లు సమాచారం. కాగా, ఈ తీర్పు కోసం చాహల్ తన IPL జట్టులో చేరకుండా ఉన్నారని సమాచారం. ఈ వార్త ఇప్పుడు క్రికెట్ ప్రపంచంతో పాటు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దంత వైద్యురాలైన ధనశ్రీ వర్మను 2020 డిసెంబర్ 22న చాహల్ పెండ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. వివాహం తర్వాత చాహల్-ధనశ్రీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. వీరు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, సోషల్ మీడియా అకౌంట్లలో ఒకరిపై మరొకరు పోస్టులు పెట్టుకుంటుండడంతో వీరిద్దరూ విడిపోతున్నరనే వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా కోర్టు తీర్పుతో వీరి విడాకులు తీసుకున్నారు. గతంలో హర్థిక్ పాండ్యా కూడా నటాషాతో అనూహ్యంగా డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే.