క్రొయేషియా (Croatia) వేదికగా (Venue) జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్ (Grand Chess Tournament) ర్యాపిడ్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen)కు అనూహ్య ఓటమి ఎదురైంది. భారత చెస్ స్టార్, యువ సంచలనం దొమ్మరాజు (Dommaraju) గుకేశ్ (Gukesh) చేతిలో కార్ల్సన్ మట్టి కరిచాడు. టోర్నీకి ముందు గుకేశ్ను బలహీన ఆటగాడిగా అభివర్ణించిన కార్ల్సన్, ఇప్పుడు తన ఓటమిపై స్పందిస్తూ గుకేశ్ను ప్రశంసించడం విశేషం. 18 ఏళ్ల గుకేశ్ చేతిలో తనకు “గట్టి శిక్ష” పడిందని కార్ల్సన్ వ్యాఖ్యానించాడు.
కార్ల్సన్ ఏమన్నాడంటే..
మ్యాచ్ అనంతరం కార్ల్సన్ మాట్లాడుతూ, “ఈ టోర్నీ ఆసాంతం నేను చాలా చెత్తగా ఆడాను. ఇప్పుడు గుకేశ్ చేతిలో నాకు గట్టి దెబ్బ తగిలింది” అని ఒప్పుకున్నాడు. ఆట ప్రారంభంలో తాను మంచి స్థితిలో ఉన్నానని భావించినప్పటికీ, గుకేశ్ తన అవకాశాలను సృష్టించుకున్నాడని కార్ల్సన్ తెలిపాడు. “నాకు ఎక్కువ సమయం లేకపోవడంతో నేను దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాను. గుకేశ్ చాలా మంచి ఎత్తులు వేశాడు. ఒకటి, రెండుచోట్ల నాకు అవకాశం వచ్చినా, నేను దాన్ని నిలబెట్టుకోలేకపోయాను. చివరికి ఓటమి తప్పలేదు. అత్యంత చెత్తగా ఆడాను. ఈ క్రెడిట్ మొత్తం గుకేశ్దే. అతను చాలా అద్భుతంగా ఆడాడు” అని కార్ల్సన్ పేర్కొన్నాడు.
ఆట ముందు తక్కువ అంచనా.. ఇప్పుడు ప్రశంసలు
క్రొయేషియా టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కార్ల్సన్, గుకేశ్ ఆటను తక్కువ చేసి మాట్లాడాడు. అయితే, ఈ ఓటమితో తన అభిప్రాయాన్ని మార్చుకుని, గుకేశ్పై ప్రశంసల వర్షం కురిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.