సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదన్న కారణంగా సీఎం రేవంత్ సహా పలువురు అల్లు అర్జున్పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పొందిన బన్నీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ను కలవబోతున్నారన్న సమాచారంతో పోలీసులు అల్లు అర్జున్ను ఆపేందుకు నోటీసులు పంపారు.
ఈ పరిణామంపై బన్నీ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో పట్ల ఒకసారి ఇలా, మరొకసారి అలా వ్యవహరించడం తగదని ఫైరవుతున్నారు. ఇది స్పష్టంగా అసమానతను చూపుతుందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.