---Advertisement---

ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు బూమ్రా దూరం? కారణం ఇదే..

ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు బూమ్రా దూరం? కారణం ఇదే..
---Advertisement---

టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే మ్యాచ్‌లు, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉండనున్నారు. బీసీసీఐ అతనికి ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం. త్వరలో భారత పర్యటనకు ఇంగ్లాండ్ జట్టు రాబోతుంది. ఈ పర్యటనలో భాగంగా భార‌త్‌తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడ‌నుంది ఇంగ్లాండ్‌.

ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాధాన్యత
ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభమవనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని బూమ్రాను ఫిట్‌గా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని కీలక పాత్రను భవిష్యత్తు టోర్నమెంట్‌లలో ఉపయోగించేందుకు బీసీసీఐ ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ విభాగంలో మార్పులు కనిపించే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment