భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టెస్ట్ వైస్ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నారు. ఇంగ్లాండ్ (England)లో జరగనున్న టెస్టు సిరీస్ (Test Series) కోసం బుమ్రాను కొన్ని మ్యాచ్లకే ఎంపిక చేస్తామని BCCI వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం గాయాల పునరావృతం నుంచి జాగ్రత్తపడటమే అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
గతంలో బుమ్రా ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో వైస్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి పూర్తి సిరీస్ ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్సీకి ఎంపిక చేస్తామని BCCI స్పష్టం చేసింది. దీంతో శుభ్మన్ గిల్ (Shubman Gill) లేదా యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పేర్లు ఈ పదవికి పరిశీలనలో ఉన్నాయని సమాచారం.
ఇంగ్లాండ్తో టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ జూన్ 20న ప్రారంభమై ఐదో టెస్టు జూలై 31న మొదలవుతుంది. ఈ సుదీర్ఘ సిరీస్లో బుమ్రాను జాగ్రత్తగా వాడుకోవాలని మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా సూచించారు. వైస్ కెప్టెన్ పదవికి బుమ్రా దూరం అయితే.. ఇంగ్లాండ్ పర్యటనకు భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్గా ఎవరు ఎంపికవుతారనేది ఆసక్తికరంగా మారింది.