‘అప్పులు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో’ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

'అప్పులు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో' – బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తితో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన చేపట్టారు. “అప్పులు ఆకాశంలో.. అభివృద్ధి పాతాళంలో” అంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ, ప్రభుత్వం రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసినా అభివృద్ధి శూన్యంగా ఉందని ఆరోపించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీలు ఇచ్చినా, వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శించారు. “రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసి మహిళలకు ఎంతమంది రూ. 2,500 ఇచ్చారు?, ఎంతమంది వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ ఇచ్చారు?, ఎంతమంది యువతులకు స్కూటీలు అందజేశారు?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. “కల్యాణమస్తు” పథకం కింద తులం బంగారం ఇవ్వాలన్న హామీ ఏమైంది? అంటూ ప్రశ్నలు సంధించారు.

అభివృద్ధి శూన్యం..
ప్రభుత్వం భారీగా అప్పులు చేసినా, ఆ నిధులు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విమర్శించారు. తమ నిరసన ద్వారా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment