బేడీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బేడీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా ప్రారంభమయ్యాయి. నల్ల దుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెట్టారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ వారు ఈ ఆందోళన చేపట్టారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేల నిరసన
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. లగచర్ల రైతుల పట్ల అన్యాయంగా వ్యవహరించిన పోలీసుల‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలతో అసెంబ్లీ స‌మావేశాలు మరింత హోరాహోరీగా సాగనున్నాయి. రైతు సమస్యలు, బిల్లులపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంద‌నే దానిపై అందరి దృష్టి నిలిచింది.

ఈరోజు స‌భ‌లో యంగ్ ఇండియా బిల్లు, యూనివర్సిటీ సవరణ బిల్లుపై ఉదయం చర్చ జరగనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment