రేవంత్‌ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా – జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా - జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎలక్టోరల్‌ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీష్‌రెడ్డి అన్నారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ప్రోత్సాహంతోనే ఏసీబీ డ్రామా నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

గ్రీన్ కో కంపెనీ దేశంలోని ఏడు నుంచి ఎనిమిది పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్లు ఇచ్చిందని చెప్పారు. ఏసీబీ కేసుకు,గ్రీన్ కో కంపెనీకీ ఏం సంబంధం అని ప్ర‌శ్నించారు. రైతు భరోసా నుంచి ప్ర‌జ‌ల దృష్టిని డైవర్ట్‌ చేయడానికే కేటీఆర్‌కు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేడన్నారు.

కేటీఆర్‌పై పెట్టిన కేసులు ప్రభుత్వానికి ప్రతిసారీ ఎదురుదెబ్బగా మారుతున్నాయని చెప్పారు. కేటీఆర్ ఇంటిపై ఏసీబీ సోదాలు చేసి ఫైల్స్ దొరికాయని చూపించేందుకు రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం ప్రయత్నం చేస్తుంద‌ని విమర్శించారు. చట్టం, రాజ్యాంగం పట్ల గౌరవంతో కేటీఆర్ విచారణకు హాజరయ్యారని, సీఎం రేవంత్ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా ఈ రోజు కుదరలేదని ఎమ్మెల్యే జ‌గ‌దీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment