మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పుడు ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. భారత జట్టు 340 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి ప్రయత్నించినా, 155 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ అండ్ మిడిలార్డర్స్ ఘోరంగా విఫలమవ్వడంతో ఆసిస్కు గెలుపు సులువైంది. ఓపెనర్ జైశ్వాల్ మినహా బ్యాట్స్మెన్స్ ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. పంత్ క్రీజ్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా అనవసరపు షాట్ కొట్టి ఫోర్ లైన్లో దొరికిపోయాడు.
మ్యాచ్ హైలైట్స్..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులు మాత్రమే చేసి వెనుకబడ్డది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆలౌటైంది, కానీ భారతపై పెద్దగా ఒత్తిడి లేకుండా మ్యాచ్ను చేతుల్లో పెట్టింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో 155 పరుగులకే కుప్పకూలింది.
ఆస్ట్రేలియా బౌలర్ల క్రమశిక్షణ, బ్యాటింగ్ లైనప్లో అద్భుత ప్రదర్శన ఈ విజయానికి కీలకం అయ్యింది. భారత్ ఇప్పుడు చివరి టెస్టులో గెలిచి సిరీస్ను సమం చేసుకోవాల్సిన ఆవశ్యకతతో ముందుకు సాగుతోంది.








