బోనాల ఊరేగింపుల్లో యువ‌తుల‌పై పోకిరీల ఆగడాలు

బోనాల ఊరేగింపుల్లో యువ‌తుల‌పై పోకిరీల ఆగడాలు

హైద‌రాబాద్ (Hyderabad) నగరంలో ఇటీవల జరిగిన మొహర్రం (Moharram), బోనాల (Bonalu) ఊరేగింపుల్లో కొందరు పోకిరీలు హద్దు మీరారు. గుంపులో ఎవరూ చూడట్లేదనే ధీమాతో మహిళలు, యువతులను (Young Women) విచక్షణారహితంగా, అనుచితంగా తాకుతూ వేధించారు (Harassed). అయితే, షీ-టీమ్స్ (SHE Teams) నిఘాలో మొత్తం 478 మంది పోకిరీలు పట్టుబడ్డారని డీసీపీ (DCP) డాక్టర్‌ ఎన్‌జేపీ లావణ్య(Dr. NJP Lavanya) మంగళవారం ప్రకటించారు.

షీ-టీమ్స్ ఈ ఆకతాయిలను పట్టుకోవడానికి రహస్య కెమెరాలను ఉపయోగించాయి. పట్టుబడిన వారిలో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నారు. ఈ పోకిరీల్లో నలుగురిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మిగిలిన వారిని మందలించి పంపారు. ఈ చర్యల ద్వారా గుంపులో జరిగే ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment