హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టాను అంటూ ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేయడంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దీంతో వెంటనే ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎయిర్పోర్ట్ ప్రాంగణాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి బాంబు లేదని తేల్చారు. దీనితో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
అధికారుల ముమ్మర తనిఖీల్లో బాంబు బెదిరింపు ఫేక్ అని తేలింది. కామారెడ్డి ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి ఈ కాల్ చేసినట్లు గుర్తించారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.