భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం (Sawai Mansingh Stadium)కు బాంబు బెదిరింపులు (Bomb threats) కలకలం సృష్టించాయి. ఈ బెదిరింపులు ఐపీఎల్ (IPL) 2025 సీజన్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై.. జైపూర్లో హైఅలర్ట్ (High alert in Jaipur) ప్రకటించింది. పోలీసు శాఖ స్టేడియం చుట్టూ భారీగా మోహరించి, స్టేడియంలో ఉన్న ప్లేయర్స్ను, సిబ్బందిని బయటకు పంపించారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) తో కలిసి బాంబుల గాలింపు చర్యలు చేపడతున్నారు.
రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA)కి మెయిల్ ద్వారా వచ్చిన ఈ బెదిరింపు, స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ల భద్రతా ఆందోళనలను మరింత పెంచింది. సవాయ్ మాన్సింగ్ స్టేడియం రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్గా ఉంది. ఈ 16న రాజస్థాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ ఘటన క్రికెట్ అభిమానులను షాక్కు గురిచేసింది.