బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనం.. – జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనం.. - జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

బీజేపీ నేతలపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌లు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే బీజేపీ నేత‌ల‌కేంటి సమస్యా? అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. త‌నపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో త‌న‌ బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల హ‌స్తం ఉండొచ్చంటూ జేసీ అనుమానం వ్య‌క్తం చేశారు.

అనంతపురంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదానికి గురైన జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీకంటే జ‌గ‌న్‌రెడ్డే మేలు కదరా మంచోడు. నా ట్రావెల్స్ బస్సులను ఆపాడు.. అంతేగానీ మీలాగ కాల్చలేదురా’.. అంటూ బీజేపీ నాయకులను
ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆగివున్న జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. బస్సును తగులబెట్టారా? లేక ప్రమాదానికి గురైందా అనే అంశంపై విచార‌ణ జరుగుతోంది. సుమారు రూ.15 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖాధికారులు అంచనా వేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment