బెంగళూరులో ఘోరం.. త‌ల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య

బెంగళూరులో ఘోరం.. త‌ల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య

గ‌త రెండ్రోజులుగా భ‌ర్త‌ల మీద భార్య‌ల ప్ర‌తాపం వార్త‌లు వ‌రుస‌గా ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఢిల్లీలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి భ‌ర్త‌ను హ‌త్య చేసి హోలీ సంబ‌రాలు చేసుకున్న భార్య‌. చెన్నైకి చెందిన బిలీనియ‌ర్ భార్య వేరే వ్య‌క్తితో అక్ర‌మ సంబంధంపై ప్ర‌శ్నిస్తే గృహ‌హింస కేసు, యూపీలో పెళ్ల‌యిన రెండు వారాల‌కే ప్రియుడితో క‌లిసి భ‌ర్తను హ‌త్య చేయించిన భార్య‌.. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్న వేళ‌.. పొరుగురాష్ట్రం బెంగ‌ళూరులో మ‌రో సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

కన్నతల్లి సాయంతో భ‌ర్త‌ను హ‌త్య చేసిందో భార్య‌. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో సంచలనం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి లోక్‌నాథ్ సింగ్ (37) శనివారం చిక్కబనవారలోని ఓ పాడుబడిన కారులో మృతదేహంగా గుర్తించబడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి, ఈ హత్య వెనుక అతడి భార్య, ఆమె తల్లి ఉన్నట్లు గుర్తించారు.

హత్యకు దారి తీసిన వివాదాలు
లోక్‌నాథ్ తన భార్యను పెళ్లికి ముందే రెండేళ్లు సహజీవనం చేశాడు. కానీ పెళ్లి అనంతరం కుటుంబ కలహాలు తలెత్తాయి. వీరి వివాహ‌నాన్ని భార్య కుటుంబ స‌భ్యులు అంగీక‌రించ‌క‌పోవ‌డం, లోక్‌నాథ్ వ్యాపారాల్లోని అక్రమ లావాదేవీలు, వివాహేతర సంబంధాలపై భార్య‌కు అనుమానాలు పెర‌గ‌డ‌మే హ‌త్యకు ప్ర‌ధాన కార‌ణాలుగా పోలీసులు తెలిపారు.

హత్యకు ముందు, అతడిని ఇంటికి పిలిచి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. లోక్‌నాథ్ స్పృహ తప్పిన తర్వాత, అతడిని ఒక ఎకాంత ప్రదేశానికి తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, బాధితుడి భార్య, అత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, లోక్‌నాథ్ మోసపూరిత వ్యాపార వ్యవహారాల్లో కూడా పాల్గొన్నాడని, బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment