బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనకు కర్ణాటక ప్రభుత్వమే (Karnataka Government) పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ(BJP) డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి (Chief Minister) సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) డీకే శివకుమార్ (D.K. Shivakumar) ఇద్దరూ రాజీనామా (Resign) చేయాలని ఆందోళనకు దిగింది.
బీజేపీ విమర్శలు:
ఆర్సీబీ(RCB) విజయోత్సవాలను ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా నిర్వహించిందని బీజేపీ మండిపడింది. ఇలాంటి కార్యక్రమాలకు అభిమానులు పెద్దఎత్తున తరలివస్తారని తెలిసినా కూడా కనీస ఏర్పాట్లపై కాంగ్రెస్ సర్కార్ (Congress Government) దృష్టిపెట్టలేదంటూ విమర్శించింది. ఇది తీవ్ర నిర్లక్ష్యం అని ఆరోపించింది.
ఆర్. అశోక్ ముఖ్యమంత్రికి లేఖ:
కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశో క్ (R. Ashok) కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ విషాదంపై చర్చించేందుకు రాష్ట్ర శాసనసభ మూడు రోజుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశం ద్వారా తొక్కిసలాట జరిగిన కారణాలు, ప్రజా భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయవలసిన తక్షణ ఆవశ్యకతపై వివరణాత్మక చర్చ నిర్వహించడం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
జనసమూహ నియంత్రణలో లోపాలు, పరిపాలన పరిస్థితిని తప్పుగా నిర్వహించడంపై అశోక్ తన లేఖలో తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. “ప్రభుత్వం సంఘటన తర్వాత తీసుకున్న చర్యలపై ప్రజల్లో ఆందోళన, అపనమ్మకం పెరుగుతోంది. పారదర్శకతకు బదులుగా, దిగువ స్థాయి అధికారులను బలిపశువులను చేస్తూ ప్రభావవంతమైన వ్యక్తులను రక్షించే ప్రయత్నాలను మనం చూస్తున్నాం” అని ఆయన లేఖలో పేర్కొన్నారు.