ఆన్లైన్ (Online), ఆఫ్లైన్ (Offline) బెట్టింగ్ మాఫియా (Betting Mafia) గుట్టు రట్టైంది. విశాఖపట్నం (Visakhapatnam) సైబర్ క్రైమ్ పోలీసులు (Cybercrime Police) బెంగళూరు (Bengaluru)లోని ఒక బెట్టింగ్ డెన్ (Betting Den)పై ఆకస్మిక దాడులు నిర్వహించి ఏకంగా 13 మంది నిందితులను అరెస్ట్(Arrest) చేశారు. బెంగళూరులోని బెట్టింగ్ డెన్తో విశాఖలో లింకులే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
బెట్టింగ్ ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు చాకచక్యంగా పట్టుకున్నారు. మ్యూల్ అకౌంట్స్ (Mule Accounts) ద్వారా డబ్బు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తి నుంచి సమాచారం అందడంతో పోలీసులు ఈ ఆపరేషన్ను నిర్వహించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కలకలం సృష్టించింది. బెంగళూరులోని ఒక బెట్టింగ్ డెన్పై ఆకస్మిక దాడులు నిర్వహించి, 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో 45 సెల్ఫోన్లు, 130 బ్యాంక్ పుస్తకాలు, 33 ఏటీఎం కార్డులు, 4 ల్యాప్టాప్లు, 2 నగదు లెక్కింపు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ బెట్టింగ్ రాకెట్లో నిందితులు అమాయక యువతను లక్ష్యంగా చేసుకుని, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖపట్నంలోని సైబర్ క్రైమ్ విభాగం, బెంగళూరులో ఈ రాకెట్ను నడుపుతున్నట్లు సమాచారం అందుకుని, ఖచ్చితమైన ఆధారాలతో దాడులు చేపట్టింది. నిందితులు బ్యాంక్ అకౌంట్ల ద్వారా భారీగా లావాదేవీలు నిర్వహించినట్లు తేలింది. మ్యుల్ అకౌంట్స్ ద్వారా నగదు బదిలీలు, హవాలా లావాదేవీలు కూడా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.