బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలు

రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతం (Bay of Bengal)లో వాయుగుండం (Cyclone) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ (Meteorological Department) హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్(Red Alert) జారీ చేస్తూ అధికారులు అప్రమత్తం చేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
రెడ్ అలర్ట్ జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert) జారీ చేశారు. అంతేకాక కర్నూలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మరో మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

తీరం వెంబడి ఈదురు గాలులు – మత్స్యకారులకు హెచ్చరిక
తీర ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తప్పనిసరి అని అధికారులు సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు (Fishermen) వచ్చే మూడు రోజులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వర్షాలు, గాలులు ఉధృతం కావడంతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment