దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన విద్యాక్షేత్రంగా పేరొందిన బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం త్వరలోనే నూతన శోభను సంతరించుకోబోతోంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్ర పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.225 కోట్ల భారీ నిధులు కేటాయించడం విశేషం. ఈ మహత్తర అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నట్లు ప్రకటించడంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఆగమ శాస్త్రాలను అనుసరించి గర్భగుడి నుంచి రాజగోపురాల వరకు సంపూర్ణ పునర్నిర్మాణం చేపట్టి, భక్తులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచుతూ, ఒకేసారి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకునేలా భారీ క్యూ కాంప్లెక్స్లు, మాడ వీధులు, గోపురాలు నిర్మించనున్నారు. స్థల పురాణం ప్రకారం మహర్షి వేద వ్యాస మహర్షి స్వయంగా గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలను ప్రతిష్టించిన ఈ క్షేత్రం చిన్నారుల అక్షరాభ్యాసానికి ప్రత్యేక కేంద్రమైంది. వసంత పంచమి వంటి పర్వదినాల్లో లక్షలాది భక్తులు తరలివచ్చే ఈ ఆలయం, అభివృద్ధి అనంతరం దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నిలవనుంది.








రాధాకృష్ణా.. నీ వ్యాఖ్యలను నీ కూతురు అంగీకరిస్తుందా..? – వైసీపీ ఆగ్రహం