ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని బాలకృష్ణ నివాసంలో జరిగింది.
బాలకృష్ణ ఇంటికి స్వయంగా వెళ్లిన కిషన్ రెడ్డి, ఆయనకు శాలువాతో సత్కారం చేయడమే కాకుండా పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అనంతరం, ఇద్దరూ కలిసి స్నేహపూర్వకంగా కాసేపు ముచ్చటించారు. ఈ ఘటన పలువురి దృష్టిని ఆకర్షించి, బాలకృష్ణ అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగించింది.
పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణకు చంద్రబాబు, పవన్, వైఎస్ జగన్, రేవంత్ సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.