అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)పై ఉగ్రదాడి(Terror Plot) కుట్రను భారత భద్రతా దళాలు సమర్థవంతంగా భగ్నం చేశాయి. హర్యానాలో జరిగిన ఆపరేషన్లో పోలీసులు ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్(Abdul Rehman)ను అరెస్ట్ చేశారు. గుజరాత్, హర్యానా రాష్ట్రాల ATS (ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ద్వారా ఈ కుట్ర బయటపడింది.
ISI ప్రేరేపిత ఈ దాడి పథకం భారతదేశ భద్రతకు పెనుముప్పుగా మారే అవకాశం ఉండేదని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు రామమందిరంపై దాడి చేయాలని భావించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై, సమాచారాన్ని సమర్థంగా వినియోగించి ఈ కుట్రను అడ్డుకున్నారు.