ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి

ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి

దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం అదుపు తప్పి విమానాశ్రయంలో గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం వల్ల వెంటనే మంటలు వ్యాపించాయి, పొగ‌ ఎయిర్‌పోర్టు పరిసరాలను కమ్మేసింది.

ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందగా, మరికొంత మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. విమానం బ్యాంకాక్‌ నుండి మువాన్‌కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్
ఈ ప్రమాదం తర్వాత సోషల్‌ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. విమానం నుండి ఎగిసిపడిన మంటలు, పొగను చూపే దృశ్యాలు ప్రజల్ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment