భారత పురుషుల హాకీ జట్టు (India Men’s Hockey Team) అద్భుతమైన ప్రదర్శనతో హాకీ ఆసియా కప్(Asia Cup)ను గెలుచుకుంది (Won). ఫైనల్లో దక్షిణ కొరియా (South Korea)ను 4-1 తేడాతో ఓడించి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను భారత్ సొంతం చేసుకుంది. ఇది భారత జట్టుకు నాలుగో ఆసియా కప్ టైటిల్ కావడం విశేషం. ఈ విజయం ద్వారా వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్లో జరగనున్న ప్రపంచ కప్కు భారత్ అర్హత సాధించింది.
రాజ్గిర్ (Rajgir)లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు సుఖ్జీత్, దిల్ప్రీత్, అమిత్ గోల్స్ సాధించారు. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 30వ సెకనులోనే సుఖ్జీత్ సింగ్ తొలి గోల్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత రెండో క్వార్టర్లో దిల్ప్రీత్, 45వ నిమిషంలో మళ్లీ దిల్ప్రీత్ గోల్స్ సాధించారు. 50వ నిమిషంలో అమిత్ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. 51వ నిమిషంలో దక్షిణ కొరియా తమ తొలి గోల్ను సాధించింది.
ఈ టోర్నమెంట్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశలో చైనాను 4-3తో, జపాన్ను 3-2తో, కజకిస్తాన్ను 15-0 తేడాతో ఓడించింది. సూపర్-4 దశలో కొరియాతో 2-2తో డ్రా చేసుకున్నప్పటికీ, మలేషియాను 4-1తో, చైనాను 7-0తో చిత్తు చేసి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయాలతో భారత జట్టు టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని చాటింది.