ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని (World Health Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అల్లూరి జిల్లాలో గిరిజన విద్యార్థులు (Tribal Students) చరిత్రను సృష్టించారు. అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఒకేసారి 21,850 మంది గిరిజన బాలబాలికలు 108 సూర్య నమస్కార ఆసనాలు నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
ఈ వినూత్న కార్యక్రమాన్ని లండన్ నుండి వచ్చిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలిస్ రేనాడ్ (Alice Renaud) స్వయంగా వీక్షించి, దీనిని ప్రపంచ రికార్డు (World Record) గా గుర్తించారు. అనంతరం ఆ ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ (Dinesh Kumar) కి అందజేశారు. ఈ ఘనత ద్వారా గిరిజన విద్యార్థుల ప్రతిభను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. ఇది కేవలం ఆరోగ్య దినోత్సవం కార్యక్రమమే కాకుండా, వారి సాంస్కృతిక స్థాయిని, క్రమశిక్షణను, శారీరక సామర్థ్యాన్ని చాటిచెప్పే మైలురాయిగా నిలిచింది.








