పన్ను విధానం (Tax Policy), డిజిటల్ పేమెంట్స్ (Digital Payments), పెన్షన్ స్కీమ్ (Pension Schemes) లకు సంబంధించి కీలక మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతున్నాయి. వీటి ప్రభావం దేశవ్యాప్తంగా కోట్లాది మందిపై పడనుంది. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), కొత్త పన్ను విధానం, జీఎస్టీ (GST) నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
కొత్త పన్ను స్లాబులు – మీపై ఏమిటి ప్రభావం?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించిన కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఏటా రూ.12 లక్షల లోపు సంపాదించే వారు పన్ను మినహాయింపుకు అర్హులు. అదనంగా రూ.75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) అందుబాటులో ఉంటుంది. రూ.12.75 లక్షలలోపు సంపాదనపై పన్ను లేని విధానం అమల్లోకి వస్తుంది. రూ.12 లక్షలకుపైగా సంపాదించే వారికి కొత్త ఆదాయ పన్ను స్లాబులు వర్తిస్తాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం ప్రయోజనం చేకూరనుంది. 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు తమ చివరి 12 నెలల సగటు ప్రాథమిక జీతంలో 50% పెన్షన్ (Pension) పొందుతారు.
యూపీఐ మార్పులు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ (UPI) వినియోగంలో భద్రతను పెంచడానికి కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇన్ యాక్టివ్ మొబైల్ నెంబర్లను బ్యాంకులు, యూపీఐ ప్రొవైడర్లు (ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Google Pay)) తొలగించనున్నారు. యూపీఐ లైట్ వ్యాలెట్ (UPI Lite Wallet) లో డబ్బు లోడ్ చేసి తిరిగి బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తోంది. యాప్ పిన్, పాస్ కోడ్ లేదా బయోమెట్రిక్ అనుసంధానం తప్పనిసరి చేయనున్నారు.
జీఎస్టీ మార్పులు
కొత్త ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ (GST) విధానంలో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి. జీఎస్టీ పోర్టల్లో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (MFA) తప్పనిసరి. 180 రోజులకు పాత డాక్యుమెంట్ల కోసం మాత్రమే E-వే బిల్లులు (EWB) రూపొందించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ మార్పుల వల్ల ఉద్యోగులు, వ్యాపారస్తులు, డిజిటల్ పేమెంట్స్ వినియోగదారులు ప్రభావితమయ్యే అవకాశముంది. ముఖ్యంగా యూపీఐ భద్రత పెరగడం, పెన్షన్ వ్యవస్థలో మెరుగుదల, పన్ను మినహాయింపుల ద్వారా మిడ్-ఇన్కమ్ (Mid-Income Group) గ్రూప్కి లాభం కలుగనుంది.