బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత‌

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్న నేపథ్యంలో, బ్యాంకు సేవలు ఈ నెల 28 నుంచి 31 వరకు నిలిపివేయబడనున్నట్లు ఏపీజీవీబీ చైర్మన్‌ కె.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. హనుమకొండలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర నిబంధనల ప్రకారం తెలంగాణలోని 493 ఏపీజీవీబీ బ్రాంచీలను టీజీబీతో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో, తెలంగాణలో ఏపీజీవీబీ ఏటీఎంలు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ మరియు ఇతర బ్యాంకింగ్ సేవలకు అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని చెప్పారు.

ఖాతాదారుల కోసం ప్రత్యేక అవకాశం
బ్యాంకు సేవలు నిలిపివేయబడిన నాలుగు రోజులకు, ఖాతాదారులకు 30, 31 తేదీలలో రూ.10,000 వరకు నిధులను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. 2025 జనవరి 1 నుండి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)గా అన్ని సేవలు పునరుద్ధరించబడతాయని ఆయన చెప్పారు. అయితే, విలీనం తరువాత కూడా ఖాతా నంబర్లు మారబోవని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment