ఏపీ యువతకు శుభవార్త.. మూడు సంస్థలతో కీలక ఒప్పందాలు

ఏపీ యువతకు శుభవార్త.. మూడు సంస్థలతో కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత ఉపాధిని లక్ష్యంగా పెట్టుకుని మరింత ముందడుగు వేసింది. రాష్ట్రానికి ప్రఖ్యాత సంస్థలను ఆహ్వానించడం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడప్)ను ఏర్పాటు చేసి, తాజాగా మూడు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఎంప్లాయిమెంట్ జనరేషన్ కోసం కీలక ఒప్పందాలు
2 కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సెంచూరియన్ సంస్థలతో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై సీడప్ చైర్మన్ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంఓయూలపై సంత‌చాలు చేశారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

ప్రభుత్వ లక్ష్యం..
గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు.
వెనుకబడిన కుటుంబాల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం.
పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమాల నిర్వహణ.

Join WhatsApp

Join Now

Leave a Comment