ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నిరుద్యోగులకు శుభవార్త అందింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం మెగా (Mega) డీఎస్సీ-2025 (AP DSC-2025) నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.
16,347 ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 15 వరకు ఆన్ లైన్లో డీఎస్సీ దరఖాస్తుల స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ (CBT) విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తునకు వివరాలు వెబ్ సైట్లలో పొందుపరిచారు. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in మరిన్ని వివరాలను పొందవచ్చు. నోటిఫికేషన్ విడుదల ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.