తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఏపీ బీజేపీ సీనియర్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ గుంట నక్క అంటూ ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులపై చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇస్తూ “కేసీఆర్ రాత్రి నిద్రపోని, ఊగిపోయే గుంట నక్క అని ఆరోపణలు చేశారు.
కేసీఆర్ కుటుంబ రాజకీయం చేస్తున్నారని విమర్శించిన ఆయన, “కేసీఆర్కు తన కొడుకు, కూతురు, మేనల్లుడి భవిష్యత్తు మాత్రమే ముఖ్యమే గాని, ప్రజల అభివృద్ధి పట్టదు” అన్నారు. బీజేపీ నాయకులు గుంట నక్కలేమీ కాదని, ప్రజాసేవే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. తెలంగాణను మాయ మాటలతో పదేళ్లు పాలించిన కేసీఆర్, ఇప్పుడు ప్రజలు నమ్మకపోవడంతో బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. కేసీఆర్ తన “గుంట నక్క” వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ అర్థం చేసుకోలేని వీర్రాజు
ఏపీలో కూటమి లేకపోతే చంద్రబాబు గెలిచేవాడు కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీ మినహా కూటమిలో ఉన్న మరో పార్టీ బీజేపీని పరోక్షంగా ప్రశంసించినట్లే. కానీ, కేసీఆర్ మాటలు అర్థం చేసుకోలేని సోము వీర్రాజు కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి కొత్త చిక్కులు కొని తెచ్చుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.