“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌

"బ్రాహ్మణులపై మూత్రం పోస్తా" – అనురాగ్ కశ్యప్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌

ప్రముఖ బాలీవుడ్ (Bollywood) దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారాయి. ఇటీవల అనురాగ్ సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు (Jyotirao) మరియు సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule) జీవిత కథ ఆధారంగా ఓ సినిమా (film) తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనుమతి నిరాకరించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఎఫ్‌సీ (CBFC) తో పాటు బ్రాహ్మణ సమాజం (Brahmin community)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “బ్రాహ్మణులపై నేను మూత్రం పోస్తానని (“I would urinate on Brahmins”)” వ్యాఖ్యానించాడు

అనురాగ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంస్థలు మండిప‌డుతున్నాయి. అతని వ్యాఖ్యలు కుల విద్వేషాన్ని రెచ్చగొట్టేయాల‌ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణ సమాజంలో ఆగ్రహాన్ని, ఏకీకరణ రావాలని కొందరు పిలుపునిస్తున్నారు. .

ఈ క్రమంలో తన వ్యాఖ్యలకు అనురాగ్ క్షమాపణలు (Apology) తెలిపారు. అయితే, “నా కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ ఎందుకు వస్తున్నాయి? ఇది కేవలం నన్నే టార్గెట్ చేయాలి కదా!” అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోలేనని స్పష్టం చేసిన అనురాగ్, “అయితే, ఎవరినైనా బాధించినందుకు మాత్రం క్షమాపణలు చెబుతున్నాను” అని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment