విశాఖలో మరో దారుణం.. మ‌తిస్థిమితం లేని మ‌హిళ‌పై..

విశాఖలో మరో దారుణం.. మ‌తిస్థిమితం లేని మ‌హిళ‌పై..

విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam) లో మ‌హిళ‌లు, యువ‌తుల‌పై జ‌రుగుతున్న వ‌రుస సంఘ‌ట‌న‌లు స్థానికుల్లో భ‌యాందోళ‌న‌లు రేకెత్తిస్తున్నాయి. మధురవాడ (Madhurawada) లో బుధవారం సాయంత్రం ప్రేమోన్మాది క‌త్తితో త‌ల్లీకూతుళ్ల‌ను విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే మ‌రో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌తిస్థిమితం (Mental Stability) లేని మ‌హిళ‌ (Women) పై ఓ దుండ‌గుడు అత్యాచారానికి (Sexual Assault) పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది.

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం జ‌రిగిన ఘ‌ట‌న కంచర పాలెం (Kancherapalem) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాన‌సిక స్థితి స‌రిగ్గా లేని మ‌హిళ‌కు స్వీట్స్ (Sweets) ఇస్తాను అని ఎర‌చూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లిన దుండగుడు ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. మహిళ తల్లిదండ్రులకి ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా అత్యాచార సంఘ‌ట‌న‌ బ‌య‌ట‌ప‌డింది. దీంతో వెంట‌నే ఆ మ‌హిళ త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఈ దారుణంపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

మ‌ధుర‌వాడ‌లో…
మ‌ధుర‌వాడ కొమ్మాది స్వ‌యం కృషిన‌గ‌ర్‌ (Swayam Krishnanagar) లో ప్రేమోన్మాది న‌వీన్ (Naveen) త‌ల్లీకూతుళ్ల‌పై దాడి చేశాడు. ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌ని డిగ్రీ చ‌దువుతున్న దీపిక‌ (Deepika)పై క‌త్తితో దాడి (Attack) చేశాడు. అడ్డువ‌చ్చిన ఆమె త‌ల్లి న‌క్కా ల‌క్ష్మి (Nakka Lakshmi) (40)పై క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడిచేయ‌డంతో యువ‌తి త‌ల్లి అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా, తీవ్ర గాయాల‌పాలైన దీపిక ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment