ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ శుక్రవారం అధికారిక జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పాటు గ్రాట్యుటీ పరిమితిని కూడా పెంచింది. ఇకపై అంగన్వాడీ హెల్పర్లకు రూ.1 లక్ష, వర్కర్లకు రూ.40 వేల గ్రాట్యుటీ చెల్లించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,20,000 మందికి లబ్ధి చేకూరనుంది.
ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
ఈ ప్రకటనతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతకొంత కాలంగా తమ వేతనాలు, రిటైర్మెంట్ ప్రయోజనాల పెంపును కోరుతూ కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఊరట కలిగించింది.